KRNL: ఆదోని మండలం బసాపురం గ్రామంలో బుధవారం ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ బీటీ నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు హాజరయ్యారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల లబ్ధిని రైతులకు వివరించారు. ప్రకృతి వ్యవసాయం, సబ్సిడీలు, వడ్డీ లేని రుణాలపై అవగాహన కల్పించారు. రైతు సంక్షేమమే లక్ష్యమని నాయకులు తెలిపారు.