W.G. ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు వడదెబ్బ నుంచి తమను తాము రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులకు కూడా పలు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మధ్యాహ్నం 12.00 నుంచి 3.00 మధ్య తీవ్రమైన ఎండ ఉంటుందని, అత్యవసరమైతేనే బయటకి రావాలన్నారు.