ATP: గుత్తి పట్టణ కేంద్రంలో రెవెన్యూ అధికారులు బుధవారం రెండు బృందాలుగా విడిపోయి హోటళ్లపై దాడులు, తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో 28 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసినట్లు మండల తహశీల్దార్ పుణ్యవతి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లకు వాడే గ్యాస్ సిలిండర్లను హోటల్లకు వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పట్టణ ప్రజలకు హెచ్చరించారు.