అన్నమయ్య: ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం మాజీ మంత్రి అంబటి రాంబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబటి రాంబాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి తానేటి వనిత, తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ వడ్డే రఘురాం నాయుడు తదితరులు పాల్గొన్నారు.