JN: రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన వల్మీడి శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 27న జరిగే శ్రీరామనవమి కళ్యాణ ఏర్పాట్లను DCP రాజమహేంద్ర నాయక్ ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు పార్కింగ్, తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో RDO వెంకన్న తదితరులు పాల్గొన్నారు.