ELR: ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద ఏలూరు ప్రధాన కాలువలో మంగళవారం రాత్రి ఓ యువకుడు కాలువలో దూకేసినట్లు స్థానికులు తెలిపారు. ఆ యువకుడు నాచుగుంట పంచాయితీ యర్రమళ్ళ గ్రామానికి చెందినట్లు వారు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న తాడేపల్లిగూడెం అగ్నిమాపక సిబ్బంది ఇవాళ ఆ యువకుడి కోసం కాలువలో గాలింపు చర్యలు చేస్తున్నారు. ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు.