HYD: పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల క్యూ లైన్లను తగ్గించేందుకు ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీని ప్రకటించింది. వ్యక్తిగత వాహనాల కోసం పెట్రోల్ బంకుల వద్ద వేచి ఉండకుండా, ప్రజా రవాణాను వినియోగించుకోవాలని ఎండీ నాగిరెడ్డి సూచించారు. ఈ నిర్ణయం వల్ల ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా, కాలుష్యం తగ్గుతుందని, సౌకర్యవంతమైన ప్రయాణం దక్కుతుందన్నారు.