TG: శాసనసభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, BJP సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇప్పసారాపై ప్రభుత్వం చిన్నచూపుచూస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఇప్పసారా తీసుకురావాలని.. అయితే ఆ పథకానికి ఇందిరమ్మ పేరు పెట్టొద్దని రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఇందిరమ్మ పేరు ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు.