TPT: చంద్రగిరి గ్రామదేవత శ్రీమూలస్థాన ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూర్ణాహుతి కలశాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు హాజరయ్యారు. వారికి ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి వేదపండితులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.