ప్రకాశం: మర్రిపూడి మండలం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో నాగూర్ వలి అధ్యక్షతన ఉపాధి హామీ సిబ్బందికి ఉమ్మడి భూముల సంరక్షణ పై శిక్షణ తరగతులు జరిగాయి. ఎస్ఎంసీ పనులు పచ్చదనంపై అవగాహనతో పాటు జీవనోపాధి, కార్బన్ క్రెడిట్ పై అవగాహన కల్పించారు. ఉపాధి హామీ సిబ్బందితో పాటు పంచాయతీ సిబ్బంది, సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.