MDK: తీవ్ర మనస్తాపానికి గురై వడ్ల మమత (26) అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన రామాయంపేట మండలం డీ ధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది. రాయపోల్ మండలానికి చెందిన నరసింహచారితో మూడేళ్ల క్రితం వివాహం అయ్యింది. కాని భర్త వరకట్న వేధింపుల కారణంగా మమత కొంతకాంగా అమ్మగారి ఊర్లో ఉంటుంది. ఈ క్రమంలో ఇవాళ ఉరేసుకుని చనిపోయింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.