ప్రకాశం: పొన్నలూరు మండలం మాలపాడు గ్రామంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. ఏదైనా ఇబ్బంది, అసౌకర్యం కలిగితే వెంటనే తల్లిదండ్రులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై సూచించారు.