RR: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఏ ఒక్క శాఖలో ఒక్క ఫైల్ పెండింగ్లో ఉండకూడదన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనులు పూర్తి చేయాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.