VZM: రాజాంలోని స్థానిక అంతకాపల్లి, మొగిలివలసలో తాగునీటి సమస్యపై రహదారిని నిర్బంధించి గ్రామస్థులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం మున్సిపల్ కమీషనర్ రామచంద్రరావును గ్రామస్థులు కలిసి వినతిపత్రం సమర్పించారు. తాగునీరు సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని, సమస్యకు శాశ్వత పరిష్కారించాలని కోరారు.