రాజస్థాన్ జట్టును అమెరికాకు చెందిన కన్సార్షియం రూ.15,300 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ టీమ్ తొలి కెప్టెన్, దివంగత క్రికెటర్ షేన్ వార్న్ ఫ్యామిలీ రూ.450 కోట్లు పొందింది. అదెలా అంటే.. IPL ప్రారంభంలో రాజస్థాన్ క్రికెట్ కార్యకలాపాలను నిర్వహించినందుకు 4 సీజన్లలో 0.75 చొప్పున 3% యాజమాన్య వాటా వార్న్ సొంతమైంది. దానితోనే వార్న్ కుటుంబం ఇప్పుడు లబ్ధి పొందింది.