HNK: ఆత్మకూరు మండలానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ వంగల రాజేంద్రప్రసాద్ ఉత్తమసేవా అవార్డు అందుకున్నారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డు లభించింది. కలెక్టర్ చాహత్ బాజ్ పేయ్, DMHO డా. అల్లం అప్పయ్య ఆయనకు ఈ అవార్డు అందించారు.