SKLM: ఆమదాలవలస పట్టణంలోని శ్రీ దేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు జరిగింది. దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు, భక్తులు, పోలీసుల సమక్షంలో హుండీని తెరిచి లెక్కించగా మొత్తం రూ. 1,49,320 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సీహెచ్ ప్రభాకర్ రావు మంగళవారం తెలిపారు.