కామారెడ్డి: గాంధారి మండలం ఎక్కకుంట తండా ఎంపీపీఎస్ విద్యార్థులు మంగళవారం వెలువడిన గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫలితాల్లో సత్తా చాటారు. 9 మంది ఎగ్జామ్ రాయగా ఏడుగురు సీట్లు రావడం గమనార్హం. మారుమూల తండాలో, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.