కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్లో కలెక్టర్ బాలాజీ రెవెన్యూ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న 430 రెవెన్యూ క్లినిక్ అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఏదైనా సమస్య తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.