పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని అన్ని పెట్రోల్ బంకుల్లో బుధవారం నాటికి ఇంధన నిల్వలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ సరఫరా సజావుగా సాగుతోందని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని స్థానిక అధికారులు స్పష్టం చేశారు.