NZB: భీమగల్ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి, దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించినట్లుఆలయధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. దేవాదాయశాఖసహాయ కమిషనర్ విజయ రామారావు సమక్షంలో లెక్కింపుజరిగిందన్నారు. హుండీ ద్వారా రూ. 4,98,491,అన్నదానం హుండీ ద్వారా రూ. 1,99,295 ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. మొత్తం రూ. 6.97లక్షల ఆదాయాన్ని ఆలయ ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు.