JGL: మల్లాపూర్ మండల కేంద్రంలో ఈనెల 31 తేదీన జరగబోయే వీర హనుమాన్ విజయయాత్రను విజయవంతం చేయాలని బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నాయకులు కోరారు. బుధవారం వేంపల్లిలోని హనుమాన్ భక్తులకు, హిందూ బాంధవులు కరపత్రాలు పంచి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో మండల బజరంగ్ దళ్ నాయకులు, గ్రామ సర్పంచ్ రాజేందర్, ఉపసర్పంచ్ హారిక, ప్రసాద్, హనుమాన్ స్వాములు పాల్గొన్నారు.