KRNL: ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఇవాళ కలెక్టర్ డా. ఏ. సిరి కోరారు. జిల్లాలో మ్యాపింగ్, కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతోందన్నారు. బీఎల్వోలు, బూత్ ఏజెంట్లు సమన్వయంతో పని చేసి ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. ఈవీఎంల భద్రతపై కూడా పరిశీలన చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.