KRNL: ఎమ్మిగనూరులోని రావుస్ డిగ్రీ కళాశాలకు చెందిన మొదటి సంవత్సరం బీసీఏ విద్యార్థిని కే. అశ్విని ఖోఖో సౌత్ జోన్ జట్టుకు ఎంపికైంది. ఇటీవల నిర్వహించిన యూనివర్సిటీ స్థాయి పోటీలలో అద్భుత ప్రదర్శన కనబరిచి ఆమె ఈ స్థానం సాధించింది. దావనగిరిలో జరిగే సౌత్ జోన్ ఖోఖో పోటీలలో ఆమె పాల్గొనుంది. కళాశాల సీఈవో తిరుమల్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఇర్ఫాన్ ఆమెను అభినందించారు.