BPT: వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కొత్తగా చేతిపంపులను ఏర్పాటు చేసినట్లు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు తెలిపారు. మండల పరిషత్ నిధులు రూ.2.5 లక్షలతో ఈ పనులను పూర్తి చేశారు. ఈ క్రమంలో మంగళవారం RWS ఏఈ బాషా గ్రామంలో పర్యటించి, కొత్తగా ఏర్పాటు చేసిన చేతిపంపులను పరిశీలించారు.