E.G: అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వం వెంటనే ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని సీపీఐ తూ.గో జిల్లా సమితి డిమాండ్ చేసింది. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పేదలకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలన్నారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలని కోరారు.