అనంతపురం ఆర్డీవో కార్యాలయం ముందు మంగళవారం సీపీఐ నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, జిల్లా నాయకులు జగదీశ్ మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల భూమితో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వ ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.