NLG: HYD-VJA జాతీయ రహదారిపై, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు మధ్య కేంద్రబిందువుగా ఉన్న చిట్యాల మున్సిపాలిటీని నూతన నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని ఆదర్శ రైతు కన్నెబోయిన మహాలింగం యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భౌగోళికంగా కీలకమైన చిట్యాల అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజలు, రైతులు ముక్తకంఠంతో కలిసి పోరాడాలని కోరారు.