ASR: హుకుంపేట మండలం భారమోసి గ్రామపంచాయతీలో తాగునీటి కోసం రూ.5 లక్షలతో బోర్వెల్ నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన జరిగింది. దీనిని వైసీపీ మండల అధ్యక్షుడు పాంగి అనిల్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ బోర్వెల్ ద్వారా గ్రామ ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం కానుందని పేర్కొన్నారు.