వనపర్తి జిల్లా పెద్ద మునగాళ్ చేడ్ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవన నిర్మాణాలకు ఆదివారం వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఆయన తెలిపారు. ఐదేళ్ల కాలంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే చెప్పారు.