WNP: పదవ తరగతి పరీక్షలను విద్యార్థులు ధైర్యంగా ఎదుర్కోవాలని AISF జిల్లా అధ్యక్షుడు నరేశ్ నిన్న పిలుపునిచ్చారు. జిల్లాలోని 221 పాఠశాలలకు చెందిన 7,212 మంది విద్యార్థులు (3,635 మంది బాలికలు, 3,577 మంది బాలురు) 37 కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరుతూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.