VZM: రాజాం పట్టణంలోని సారధి అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను, స్టాకును పరిశీలించారు. అనంతరం పిల్లలకు ఇస్తున్న పోషకాహారం, వారి ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీశారు. అలాగే, చిన్నారులతో మాట్లాడి వారి అవగాహన స్థాయిని తెలుసుకున్నారు.