VZM: జాతీయ క్షయవ్యాధి నిర్మూలన(NTEP) కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పలువురిని ప్రభుత్వం అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో రాజాం మండలం పాగిరి PHC మెడికల్ ఆఫీసర్ డా.గట్టి భార్గవి అవార్డుకు ఎంపికయ్యారు. క్షయవ్యాధి నియంత్రణకు అమలుకు ఆమె చేసిన కార్యక్రమాలు ఆధారంగా ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం DMHO చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.