ప్రకాశం: కనిగిరి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయ ప్రాంగణ సమీపంలో యుటీఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి నిరాహార దీక్షలను మంగళవారం ఉపాధ్యాయులు చేపట్టారు. ఉపాధ్యాయుల దీక్షలకు పలు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. యుటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ.. టిీీఎ, డీఎ బకాయిలు వెంటనే చెల్లించాలని, హెల్త్ స్కీమ్ సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీ కమిషన్ ఛైర్మన్ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు.