మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 21 డివిజన్ ఉరగుట్ట చెరువు రోడ్డు ప్రాంతంలో వీధి బల్బులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. విషయాన్ని స్థానికులు నూతన కార్పొరేటర్ గుండా సంతోష్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఆయన గురువారం రాత్రి నూతన బల్బులను ఏర్పాటు చేయించారు. వాటిని ఆ ప్రాంత వాసులతో కలిసి ప్రారంభించగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.