చిత్తూరు: ఐరాల మండలం పాలకలలోని 8.49 ఎకరాలను నిషేధిత జాబితా 22ఏ(1)ఈ నుంచి డీ-నోటిపై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 1681/2 సర్వేలో 5.66 ఎకరాలు, 1682/3 సర్వేలోని 2.83 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.