అన్నమయ్య: మదనపల్లిలో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ నిశాంత్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో అధికారులు,శెట్టిబలిజ సంఘ ప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు. విద్యా ప్రాధాన్యతను ముందుగానే గుర్తించి పాఠశాలలు, గ్రంథాలయాల స్థాపనకు కృషి చేసిన దూరదృష్టి గల నాయకుడని కొనియాడారు.