CTR: కాణిపాకం వినాయక స్వామి వారి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ పీహెచ్డీ రామకృష్ణ ఐపీఎస్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఈవో పెంచల కిషోర్ స్వామివారి శేషవస్త్రం, చిత్రపటాన్ని ఐజీకి అందజేశారు.