ATP: రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో నీటి సరఫరాపై దృష్టి సాధించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ బీజేపీ మాజీ కౌన్సిలర్లు కమిషనర్కు వినతిపత్రం అందించారు. వేసవికాలం మొదట్లోనే నీటి సరఫరా సరైన సమయంలో అందక ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గడిచిన రంజాన్, ఉగాది పండుగ వేళల్లో కూడా నీటి సరఫరా అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.