KMM: బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారత స్వాతంత్ర సంగ్రామంలో యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన విప్లవ వీరుడు సర్దార్ భగత్ సింగ్ అని AISF జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్ అన్నారు. సోమవారం స్థానిక మధిర బీసీ బాయ్స్ హాస్టల్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమరవీరుల ఆశయాలను కొనసాగించి, వారి స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు.