ADB: గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ పేర్కొన్నారు. గుడిహత్నూర్ మండలంలోని తోషం తండా, సోయం గూడ, లెండి గూడ, కమలాపూర్ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేసి ప్రారంభించారు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన తెలిపారు.