CTR: చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి IDRF నిధి నుంచి రూ.1 లక్ష విలువైన చెక్కును దివంగత ASI మనోహరన్ కుటుంబానికి అందజేశారు. చిత్తూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న మనోహరన్ అనారోగ్యం కారణంగా మరణించారు. ఈ చెక్కును ఆయన సతీమణి భారతి స్వీకరించారు. ఈ సందర్భంగా, ఎస్పీ మాట్లాడుతూ.. కుటుంబానికి తమ పూర్తి అండ ఉంటుందని భరోసా ఇచ్చారు.