MDK: బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు “ఛలో అసెంబ్లీ” కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ ముట్టడి బయలు దేరిన బీజేవైఎం మెదక్ జిల్లా అధ్యక్షుడు సతీష్తో పాటు బీజేపీ నాయకులను సోమవారం మెదక్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచక, మోసపూరిత పరిపాలన నిరసనగా అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న వారిని ముందస్తు అరెస్ట్ చేయడం అన్యాయం అన్నారు.