VSP: ఏఐ సమ్మిట్లో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై కూటమి నేతలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. సమ్మిట్ జరుగుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రవేశించి దాడి చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇందులో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ అధ్యక్షుడు పివిఎన్.మాధవ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు.