JGL: పండుగల కారణంగా వచ్చిన సెలవుల తర్వాత జగిత్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నేటి నుంచి క్రయవిక్రయాలు మళ్లీ ప్రారంభం కానున్నాయని మార్కెట్ అధికారులు తెలిపారు. అమావాస్య, ఉగాది, రంజాన్, ఆదివారం నేపథ్యంలో మార్కెట్ మూసివేయగా.. నేటి నుంచి యథావిధిగా కార్యకలాపాలు కొనసాగనున్నాయని వెల్లడించారు. రైతులు, వ్యాపారులు గమనించాలన్నారు.