PDPL: “చలో అసెంబ్లీ” కార్యక్రమానికి వెళుతున్న మంథని మండల బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు నిరసనగా బీజేపీ ఈ కార్యక్రమం చేపట్టగా, దాన్ని అడ్డుకునేందుకే అరెస్టులు చేసినట్లు బీజేపీ నేతలు ఆరోపించారు. అరెస్ట్ అయిన వారిలో మండల అధ్యక్షుడు విరబోయిన రాజేందర్, సబ్బని సంతోశ్, రేపాక శంకర్, ఎడ్ల సాగర్,ఉన్నారు.