SRPT: విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలని కోరుతూ టీపీటీఈ నాయకులు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. పెన్షన్లు, కేజీబీవీ ఉద్యోగుల టైమ్ స్కేలు, ఉపాధ్యాయులకు డిజిటల్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.