KRNL: ధర్మపథం కార్యక్రమంలో భాగంగా శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఆదివారం నిత్య కళారాధన వేదికపై ఖమ్మం అభినయ రుద్ర నాట్యాలయం సంప్రదాయ నృత్యంతో అలరించింది. ఈ కార్యక్రమాల్లో హరికథ, బుర్రకథ, వాయిద్య సంగీతం, భక్తిరంజని వంటి ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.