BHNG: వలిగొండ పట్టణ కేంద్రానికి చెందిన ఆత్మీయభారతి సాహిత్య సంస్థ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ కవి రెబ్బ మల్లికార్జున్ను ఘన సన్మానించారు. రామన్నపేట మండలం వెల్లంకిలోని ఆచార్య కూరెళ్ళ గ్రంథాలయంలో ఆదివారం జరిగిన ఉగాది కవిసమ్మేళనంలో పాల్గొని తన కవితను వినిపించి నిర్వహకులచే ప్రశంసలను పొందారు. ఈ సందర్భంగా పలువురు కవులు అభినందనలు తెలిపారు.