ASR: ఛత్తీస్ఘడ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలో ఆదివారం జరిగిన బస్తర్ హెరిటేజ్ మారథాన్ పోటీలలో అల్లూరి జిల్లా అరకులోయ మండలానికి చెందిన నలుగురు పిల్లలు పాల్గొన్నారు. 42km మారథాన్లో కిల్లో బుద్దు, 21kmలో కొర్రా గోపి, 5kmలో బురిడి జానిబాబులు పాల్గొని టాప్ 20లో నిలిచారు. అలాగే 5km సబ్ జూనియర్ మారథాన్లో పాల్గొన్న కిల్లో వినాయక్(8) టాప్ 5లో నిలిచాడు.